
గిన్నీస్ బుక్లో డోన్ విద్యార్థులకు చోటు
డోన్ టౌన్: పట్టణానికి చెందిన విద్యార్థులు కొండెపోగు జోనాధన్, కొండెపోగు సూసన్గ్రేస్లు(అన్న చెల్లెలు) గిన్నీస్ బుక్లో చోటు సంపాదించారు. గతేడాది డిసెంబరు 1వ తేదీ విజయవాడలోని హలేల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు ఆగస్టిన్ దండింగి వేణుగోపాల్ ఆధ్వర్యంలో వీరు కీబోర్డ్ ప్లే వాయించారు. దానిని ఇంస్ట్రాగామ్లో పోస్టు చేయగా.. 1,046 మంది అప్లోడ్ చేశారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వారు గుర్తించి ఈ నెల 14వ తేదీ హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వీరికి మెడల్తో పాటు సర్టిఫికెట్ ప్రదానం చేశారు.
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 16న ఉదయం 10 గంటల నుంచి జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి నోటు ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నామని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమావేశాల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, పనులు, ఆర్థిక ప్రణాళిక తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగే ఈ సమావేశాలకు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు వారికి కేటాయించిన సమయంలో హాజరు కావాలని సీఈఓ కోరారు.
డాక్టర్ రవికృష్ణకు ‘కందుకూరి’ పురస్కారం
నంద్యాల(వ్యవసాయం): కందుకూరి రాష్ట్రస్థాయి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారానికి నంద్యాల కళారాధన సాంస్కృతిక సంస్థ డాక్టర్ రవికృష్ణ ఎంపికయ్యారు. కందుకూరి వీరేశలింగం జయంతి, ఏప్రిల్ 16న తెలుగు నాటక రంగ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం విజయవాడలో కందుకూరి రాష్ట్రస్థాయి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రస్థాయి పురస్కారానికి ముగ్గురిని ఎంపిక చేయగా అందులో డాక్టర్ రవికృష్ణ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్రస్థాయి పురస్కరాలను అందజేయనున్నారు. డాక్టర్ రవికృష్ణ 2000 సంవత్సరంలో నంద్యాలలో కళారాధన సాంస్కృతిక సంస్థ స్థాపించారు. గత 25 సంవత్సరాలుగా కళ, నాటక రంగాలకు చేసిన విశిష్ట సేవలను గుర్తించి అవార్డు ఇవ్వడానికి ఎంపిక చేశారు.
దాడి చేసింది ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులే
– ఫిర్యాదు చేసిన బాధితుడు
ఆళ్లగడ్డ: టీడీపీ నాయకుడు సింగం భరత్రెడ్డిపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులే దాడి చేసినట్లు బాధితుడే తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే అనుచరులైన ఆరుగురిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పట్టణ సీఐ యుగంధర్ తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన సింగం భరత్రెడ్డిపై సోమవారం పట్టణంలోని నాలుగు రోడ్లకూడలిలో దాడి జరిగిందన్నారు. ఈ దాడికి సబంధించి బాధితుడు భరత్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణానికి చెందిన శివతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
దరఖాస్తు గడువు
పొడిగింపు
నంద్యాల(న్యూటౌన్): కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే గడువు 11వ తేదీతో ముగిసింది. అయితే ప్రభుత్వం ఈ నెల 21వ తేదీ వరకు గడువును పొడిగించింది. జిల్లాలోని 27 కేజీబీవీలు ఉన్నాయి. 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరంలో బైపీసీ గ్రూప్లో 40 సీట్లు చొప్పున ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులను ఎంపిక చేస్తారు. ప్రతీ సంవత్సరం అన్ని తరుగతులు కలిసి కస్తూరిబాలో 280 మంది విద్యనభ్యసిస్తున్నారు.

గిన్నీస్ బుక్లో డోన్ విద్యార్థులకు చోటు