అటవీ సంరక్షణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

అటవీ సంరక్షణకు చర్యలు

Mar 20 2025 1:56 AM | Updated on Mar 20 2025 1:51 AM

రుద్రవరం: అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెలిమ రేంజ్‌ పెద్దకంబలూరు సెక్షన్‌ అధికారి కిషోర్‌ తెలిపారు. బుధవారం ఆయన ఎఫ్‌బీఓ రామారావుతో కలిసి పెద్దకంబలూరు వంతెన వద్ద గేటు ఏర్పాటు చేశారు. ఈ విషయంపై వారు మాట్లాడుతూ తెలుగుగంగ ప్రధాన కాల్వ నిర్మించే సమయంలో అటు వైపు గ్రామాల ప్రజల అవసరాల నిమిత్తం పెద్దకంబలూరు వద్ద వంతెన ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామంతో పాటు అప్పనపల్లె, పందిర్లపల్లె తదితర గ్రామాల ప్రజలు ఆ వంతెన మీదుగా లోపలికి వెళ్లి పశువులను మేపుకొని తిరిగొచ్చేవారు. అయితే, కొందరు దుండగులు ఆ దారిన అడవిలోనికి వెళ్లి నేరానికి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి రావడంతో ఉన్నతాధికారుల అనుమతులు తీసుకోని అడవిలోకి రాక పోకలు నిషేధిస్తూ గేటు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.త్వరలో తెలుగుగంగ ప్రధాన కాల్వ కట్టపై ఓ బేస్‌ క్యాంప్‌ కూడా ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారుల అనుమతులిచ్చారన్నారు. బేస్‌ క్యాంప్‌ ఏర్పాటు అయితే నల్లమల అటవీ సంరక్షణకు మరింత మంది సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement