ఫ మూసీ ఉధృతి | - | Sakshi
Sakshi News home page

ఫ మూసీ ఉధృతి

Aug 11 2025 6:18 AM | Updated on Aug 11 2025 6:18 AM

ఫ మూసీ ఉధృతి

ఫ మూసీ ఉధృతి

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం సాయంత్రం వరకు ఎగువ నుంచి 5,082 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అధికారులు ప్రాజెక్టు ఐదు క్రస్ట్‌గేట్లను మూడు అడుగుల మేర పైకెత్తి 9,598 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. నీటిమట్టాన్ని 643.50 వద్ద నిలకడగా ఉంచి ఎగువ నుంచి వస్తున్న వరద మొత్తం దిగువకు వదులుతున్నారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 286 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.0 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు ఏఈ మధు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement