మా గ్రామంలో విద్యార్థులు, యువకులు సరైన ఆటస్థలం లేక చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల స్థలంలో విద్యార్థులకు ఆడుకోవడానికి ఏర్పాటు చేయగా.. ఇంకా మిగిలిన స్థలంలో చెట్లు, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. గ్రామ యువకులు, పెద్దల సమక్షంలో తీర్మానం చేసుకొని మిగిలిన స్థలాన్ని ఆటలు ఆడుకోవడానికి కేటాయించాలని గ్రామ పాలకమండలి తీర్మానించింది. ఉన్నతాధికారులు స్పందించి ఆటస్థలం కేటాయిస్తే బాగుంటుంది.
– కొట్ర గ్రామస్తులు, వెల్దండ మండలం
●


