
యువత డ్రగ్స్కు బానిస కావొద్దు
ములుగు రూరల్: యువత డ్రగ్స్కు బానిసలుగా మారి బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని జిల్లా రవాణా శాఖ అధికారి బారగాడి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు బుధవారం రవాణాశాఖ కార్యాలయంలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా సమాచారా న్ని పోలీసులకు అందించాలన్నారు. మాదక ద్రవ్యాల రవాణా అరికట్టేందుకు చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణాపై అ ప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కార్యక్రమ ంలో కార్యాలయ సిబ్బంది, యువత పాల్గొన్నారు.
జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్