
హర్ఘర్ తిరంగా ర్యాలీ
ములుగు రూరల్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురష్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమై ములుగు ఏరియా వైద్యశాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం మాట్లాడుతూ హర్ఘర్ తిరంగా ర్యాలీ ఒక కార్యక్రమం కాదని.. ఇది మన బాధ్యత అని తెలిపారు. స్వాతంత్య్ర యోధులకు మనమిచ్చే నివాళి అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, రమేష్, సురేందర్, రవీంద్రచారి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ములుగులో నిర్వహిస్తున్న ర్యాలీ