
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
ములుగు: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ జెడ్పీ చైర్పర్సన్, ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సభ వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచే వారిని గుండెల్లో పెట్టుకుంటామన్నారు. అలాగే రవళి కు టుంబానికి న్యాయం చేసి వైద్యులపై చర్య తీసుకో వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్నాయక్, ములుగు మండల అధ్యక్షుడు రమేష్రెడ్డి, పోరిక వి జయరాంనాయక్, రాసమల్ల సురేందర్, కోగిల మ హేష్, పాలెపు శ్రీను, చెన్న విజయ్ పాల్గొన్నారు.