Vamshi Paidipally: తండ్రి ఎమోషనల్‌.. ఇది నాకు అతిపెద్ద విజయం: డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి

Vamshi Paidipally Shares His Father Gets Emotional After Varisu Movie Watched - Sakshi

సంక్రాంతి రోజున ఓ వీడియో షేర్‌ చేస్తూ ఎమోషనల్‌ అయ్యారు ప్రముఖ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి. ఆయన తాజాగా తెరకెక్కించిన మూవీ వారసుడు(తమిళంలో వారీసు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. పండుగ రోజున వంశీ తన తల్లి, తండ్రి, భార్యతో కలిసి కుటుంబ సమేతంగా థియేటర్లో వారసుడు మూవీ చూశారు. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

చదవండి: హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు: ఆ కామెంట్స్‌పై జక్కన్న స్పందన

ఇక ఈ సినిమా చూసిన వంశీ పైడితల్లి తండ్రి సైతం భావోద్వేగానికి గురయ్యారు. పుత్రోత్సాహంతో ఆయనను హుత్తుకుని ఎమోషనల్‌ అయిన వీడియో వంశీ పైడిపల్లి షేర్‌ చేశారు. ‘‘నా జీవితంలో అతి పెద్ద విజయం సాధించాను. ‘వారసుడు’ వీక్షించి నా తండ్రి ఎంతగానో ఆనందించారు. ఈరోజు నేను నా జీవితంలో అతిపెద్ద విజయాన్ని అందుకున్నాను. జీవితాంతం ఈ క్షణాలను గుర్తుపెట్టుకుంటాను. నాన్నా.. నువ్వే నా హీరో. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’’ అంటూ వంశీ రాసుకొచ్చారు. 

చదవండి: ఆస్కార్ రావాలంటే సినిమాకు ఎలాంటి అర్హతలుండాలి..?

‘మహర్షి’ వంటి కమర్షియల్‌ విజయం తర్వాత వంశీ తెరకెక్కించిన పూర్తిస్థాయి తమిళ చిత్రం ‘వారీసు’. తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రానికి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో విజయ్‌ సరసన రష్మిక మందన్నా నటించగా.. జయసుధ, ఖుష్బూ, శరత్‌కుమార్‌, శ్రీకాంత్‌‌, శ్యామ్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలు పోషించారు. తమిళంలో  ఈ చిత్రం జనవరి 11న విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top