యాడ్స్‌లో అగ్రహీరోల హవా..రోజుకి అన్ని కోట్లా? | From Chiranjeevi To Balakrishna... Do You Know How Much Our Tollywood Senior Actors Money Earning From Ads | Sakshi
Sakshi News home page

యాడ్స్‌లో అగ్రహీరోల హవా..రోజుకి అన్ని కోట్లా?

Apr 9 2025 2:15 PM | Updated on Apr 9 2025 3:01 PM

Tollywood senior heroes Chiranjeevi To Balakrishna Earn Huge Money From Ads

హైదరాబాద్‌ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్‌లో ఆ నలుగురూ కనపడుతుంటారు. అరవై లో ఇరవైలాగా యాడ్స్‌లోనూ కుర్రహీరోలకు పోటీగా అదరగొడుతుంటారు. తెలుగు సీనియర్‌ హీరోలు వయసు పెరుగుతున్నా తగ్గేదేలే అన్నట్టుగా ప్రకటనల ప్రపంచంలో దూసుకుపోతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి(chiranjeevi) తన కెరీర్‌లో ఫిలిప్స్‌ ఇతర బ్రాండ్‌లకు ఎండార్స్‌మెంట్‌లతో సహా అనేక ప్రకటనలలో పాలుపంచుకున్నారు ఆయన చాలా కాలం క్రితమే ప్రముఖ బ్రాండ్స్‌కు పనిచేశారు. ఆయన చేసిన థమ్సప్‌ యాడ్‌ సంచలం సృష్టించడంతో పాటు వివాదాలకు కూడా కేంద్రబిందువైంది. ఆ యాడ్‌లో ఆయన ప్రస్తుత యువ కధానాయకుడు శర్వానంద్‌తో కలిసి కనిపించడం విశేషం. సమకాలీకులతో పోలిస్తే ఒకప్పుడు యాడ్‌ వరల్డ్‌లోనూ ముందున్న చిరంజీవి ప్రస్తుతం ఈ విషయంలో కొంత వెనుబడ్డారు. ఆయన  కంట్రీ డిలైట్‌ ప్రకటనల్లో కనిపిస్తున్నారు.

కింగ్‌ నాగార్జున(Nagarjuna Akkineni) ఒకప్పుడు ప్రకటనల విషయంలో చాలా దూసుకుపోయారని చెప్పాలి. సమకాలీకుల కంటే బాగా ముందుండేవారు. ఐదు పదుల వయస్సు దాటిన హీరోల్లో మిగిలిన వారితో పోలిస్తే ఆయన ఎక్కువగా ప్రకటనల్లో ఆయన కనిపించారు. నాగార్జున అక్కినేని  డాబర్‌ మెస్వాక్‌ టూత్‌పేస్ట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా  చేశారు, అలాగే కేరళకు చెందిన కళ్యాణ్‌ జ్యువెలర్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌. ఈ బ్రాండ్‌కి సంబంధించిన నాగ్‌ పోస్టర్‌లు  ప్రకటనలు కళ్యాణ్‌ జ్యువెలర్స్‌కు మంచి గుర్తింపునిచ్చాయి. ఘడి డిటర్జెంట్‌తో సహా ఇతర ఉత్పత్తుల ప్రకటనలలో కూడా కనిపించిన నాగార్జున  అమితాబ్‌ బచ్చన్‌ తో కలిసి యాడ్స్‌ కోసం స్క్రీన్‌ స్పేస్‌ను పంచుకోవడం విశేషం.

విక్టరీ వెంకటేష్‌(Venkatesh) దగ్గుబాటి  మణప్పురం జనరల్‌ ఫైనాన్స్‌ అండ్‌ లీజింగ్‌ లిమిటెడ్‌ , రామ్‌రాజ్‌ కాటన్‌ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు అదే విధంగా బైక్‌ వొ మార్కెటింగ్‌  బ్రాండ్‌ ప్రమోషన్‌ కార్యకలాపాలలో కూడా పాల్గొన్నారు. మూవీ ఈవెంట్స్‌  ప్రమోషన్స్‌ కంపెనీ అయిన శ్రేయాస్‌ మీడియా విక్టరీ వెంకటేష్‌  మెడ్‌ప్లస్‌ ప్రకటనతోనే ప్రకటనల రంగంలోకి అడుగు పెట్టింది. బైక్‌ వోలో వ్యూహాత్మక పెట్టుబడిదారు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వెంకటేష్‌.. మార్కెటింగ్, ఔట్రీచ్‌  బ్రాండ్‌ ప్రమోషన్‌ కార్యకలాపాలకు సహకరిస్తున్నారు. ఈ భాగస్వామ్యం 2025 నాటికి భారతదేశం అంతటా 20,000 ఇవి ఛార్జింగ్‌ పాయింట్‌లను ఇన్‌స్టాల్‌ చేయాలనే లక్ష్యంతో  ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది.

తాజాగా అగ్రగామి రియల్‌ ఎస్టేట్‌ బ్రాండ్‌ కాసా గ్రాండ్‌ వెంకటేష్‌ను తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించింది. తాజాగా బాక్సాఫీస్‌ హిట్‌ అయిన సంక్రాంతికి వస్తున్నాం తో...వెంకటేష్‌ ను మరింత మంది యాడ్‌ మేకర్స్‌ సంప్రదిస్తున్నట్టు సమాచారం.

సమకాలీకులతో పోలిస్తే ఒకప్పుడు ప్రకటనల ప్రపంచంలో పూర్తిగా వెనుకపడిన మాస్‌ హీరో బాలకృష్ణ అరవై ఐదేళ్ల వయసులో బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్స్‌ కు టాప్‌ అడ్రెస్‌గా మారారు. తొలిసారి సౌత్‌ ఇండియా ఆధారిత కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ ప్లాటింగ్‌ సర్వీసెస్‌ కంపెనీ సాయి ప్రియా గ్రూప్‌తో ప్రకటనల ప్రపంచంలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ప్రస్తుతం మాల్స్‌  దగ్గర నుంచి నగల బ్రాండ్ల దాకా  ప్రమోట్‌ చేస్తున్నారు.  రెండు రోజుల వర్క్‌కి గాను ఆయన రూ. 3 కోట్ల నుంచి ఆపైన దక్కించుకుంటారని యాడ్‌ నిపుణులు చెబుతున్నారు. అంతకుముందు, ఆయన ఓ రిటైల్‌ బ్రాండ్‌ ప్రచారంలో నటి ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి కనిపించాడు.  ‘అఖండ‘, ‘భగవంత్‌ కేసరి’  ‘వీరసింహారెడ్డి‘ వంటి హ్యాట్రిక్‌ హిట్‌లతో, నటుడిగా అతని స్థాయి పెరిగింది. ‘వరుసగా మూడు బ్లాక్‌బస్టర్‌లు కొట్టడంతో టాలీవుడ్‌లో తన సమకాలికుల కంటే యాడ్‌ వరల్డ్‌లో ముందున్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement