తన కలను నెరవేర్చుకోవడానికి ఎంతగానో శ్రమించి, ఇప్పుడు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు నటి భానుప్రియ. ఈమె పదహారు అణాల తెలుగు ఆడపడుచు కావడం విశేషం చాలా మంది తెలుగు తారలు మాదిరిగానే ఈమె కూడా తమిళంలో నటిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు.
దీని గురించి ఆమె తెలుపుతూ ‘‘చిన్న వయసు నుంచే సినిమాల్లో నటిచాలని కలలు కనేదాన్ని. లయోలో కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్ చదివాను. తరువాత పకృద్ధీన్ మాస్టర్ నాటక బృందంలో చేరాను. ఆ తర పలు ప్రముఖ టీవీ సంస్థల్లో పని చేసి తన కలను నెరవేర్చుకోవడానికి సినీ రంగప్రవేశం చేశాను. పకృద్ధీన్ మాస్టర్ ద్వారా కూళంగళ్ చిత్రంలో మొదటి సారిగా నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత నా సినీ పతనాన్ని ముందుకు తీసుకురావడానికి తాయ్ కిళవి చిత్రం అమిరింది . తాజాగా మొద రాతిరి చిత్రంలో నటుడు బక్స్కు భార్యగా దేవి అనే పాత్రలో నటించాను .
అందులో తన పొత్రకం పలువురి ప్రశంసలు లభించాయి. తదుపరి వెట్రిమారన్ దర్శకత్వంలో రాజన్ వగైయారా చిత్రలో నటుడు కు కిశోర్ కు భార్యాగా నటిస్తున్నాను. దీనితో సంతానం కథానాయకుడుగా నటిస్తున్న లవ్ బైట్ చిత్రంలో, అమరన్ చిత్రం ఫేమ్ రాజ్ కమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన ఓం చిత్రంలోనూ ముఖ్య పాత్రలు పోషిస్తున్నాను. ఇలా ప్రముఖ దర్శకుల చిత్రాల్లో తాను ఒక భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని నటి భానుప్రియ పేర్కొన్నారు.


