కేరళ కోసం విరాళాలు ప్రకటించిన స్టార్స్‌.. ఎవరెవరు ఎంత..? | South Indian Movie Stars Help To Kerala Floods | Sakshi
Sakshi News home page
breaking news

కేరళ కోసం విరాళాలు ప్రకటించిన స్టార్స్‌.. ఎవరెవరు ఎంత..?

Aug 1 2024 8:59 PM | Updated on Aug 1 2024 8:59 PM

South Indian Movie Stars Help To Kerala Floods

కేరళలో భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఎక్కడ చూసిన నీటితో నిండిపోయిన నగరాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్‌ ప్రాంతంలో భారీ వర్షం వల్ల చాలామంది ఆశ్రయం కూడా కోల్పోయారు. యాన్ని  ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటికే 200 మందికి పైగానే విగతజీవులుగా  మారితే.. మరికొంత మంది ఆచూకీ లేకుండా పోయింది.  ఇప్పటికీ అనేకమంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఈ విపత్తులో కేరళను ఆదుకునేందుకు తమ వంతుగా సాయం చేసేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు.

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరో మమ్ముట్టి, ఆయన కుమారుడు  దుల్కర్ సల్మాన్ సాయం చేసేందకు ముందుకొచ్చారు.  రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయం కోసం మమ్ముట్టి రూ.20 లక్షలు, దుల్కర్ సల్మాన్‌ రూ. 15 లక్షలు కేరళ  మంత్రి పి రాజీవ్‌కు అందజేశారు. ఇదే సమయంలో ఫహాద్ ఫాజిల్- నజ్రియా దంపతులు కూడా  ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు. ఈ విషయాన్ని స్వయంగా ఫహద్ ఫాజిల్ తన నిర్మాణ సంస్థ ఫహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ లెటర్‌ ప్యాడ్‌పై ముఖ్యమంత్రికి రాసిన లేఖను షేర్ చేస్తూ తెలియజేశాడు. 

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా రూ. 10 లక్షలు ప్రకటించారు. అయితే, ఇప్పటికే సూర్య, జ్యోతిక, కార్తీ రూ. 50 లక్షలు అందించగా.. విక్రమ్ రూ. 20 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ కోసం అండగా నిలబడుతున్న స్టార్‌ హీరోలను నెటిజన్లు అభినందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement