ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ సినిమా | Racharikam OTT Telugu Movie Details Latest | Sakshi
Sakshi News home page

Racharikam OTT: అప్సర రాణి కొత్త మూవీ.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

Apr 8 2025 5:59 PM | Updated on Apr 8 2025 6:10 PM

Racharikam OTT Telugu Movie Details Latest

ఆర్జీవీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న అప్సర రాణి.. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'రాచరికం'. జనవరిలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు.

(ఇదీ చదవండి: తమన్నా 'ఓదెల 2' ట్రైలర్ రిలీజ్)

రాయలసీమ బ్యాక్ డ్రాప్ కథతో తీసిన పొలిటికల్ థ్రిల్లర్ తెలుగు సినిమా 'రాచరికం'. అప్సర రాణి, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కంటెంట్ లో లోటుపాట్లు వల్ల థియేటర్లలోకి వచ్చి వెళ్లిన సంగతి కూడా చాలామందికి తెలియదు. అలాంటిది ఏప్రిల్ 11 నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోకి రానుందని ప్రకటించారు.

'రాచరికం' విషయానికొస్తే.. రాచకొండ అనే ఊరిని రాజారెడ్డి ఏకగ్రీవంగా పరిపాలిస్తుంటాడు. ఈయనకు కొడుకు వివేక్ రెడ్డి (వరుణ్ సందేశ్), కూతురు భార్గవి రెడ్డి (అప్సర రాణి) ఉంటాయి. కొన్ని అనుకోని పరిస్థితుల్లో అన్నచెల్లి ప్రత్యర్థులుగా మారతారు. తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement