షెడ్యూల్‌ మారింది

Pushpa Shooting Schedule Has Been Changed - Sakshi

‘పుష్ప’ ప్లానింగ్‌లో చిన్న మార్పు వచ్చిందట. అనుకున్న టైమ్‌ కంటే ఓ నెల ముందే బరిలో దిగాలనుకుంటోందట చిత్రబృందం. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రష్మికా మందన్నా కథానాయిక. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథాంశం ఉంటుంది. అల్లు అర్జున్, రష్మిక ఈ సినిమాలో చిత్తూరు యాసలో సంభాషణలు పలకనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలనుకున్నారు. ఇప్పుడు డిసెంబర్‌లో కాదు నవంబర్‌లోనే సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. కేరళ అడవుల్లో ఈ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారట. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top