Priyanka Chopra: స్వీట్‌ న్యూస్‌ చెప్పిన స్టార్‌ హీరోయిన్‌.. సరోగసి ద్వారా తల్లైన ప్రియాంక

Priyanka Chopra and Nick Jonas Welcome Their First Baby Via Surrogacy - Sakshi

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా తల్లైంది. సరోగసి ద్వారా ప్రియాంక- నిక్‌ జోనస్‌ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 'సరోగసీ ద్వారా మాకు బిడ్డ పుట్టింది. ఈ ఆనందకరమైన సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. దయచేసి మా గోప్యతకు భంగం కలిగించకండి. ధన్యవాదాలు..' అని రాసుకొచ్చింది.

ఈ విషయం తెలిసిన సెలబ్రిటీలు, అభిమానులు ప్రియాంక దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా నిక్‌, ప్రియాంక 2018 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. రాజస్తాన్‌లోని ఉమైద్‌ భవన్‌ రాజభవనంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. క్రిస్టియన్‌ పద్ధతిలో ఓసారి, హిందూ సంప్రదాయంలో మరోసారి వీరి పెళ్లి జరిపించారు.

సరోగసి ద్వారా తల్లైన హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ఫొటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top