
యంగ్ టాలెంట్ సుధీస్, అంకిత హీరో హీరోయిన్లుగా అరవింద్ జాషువా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘పేషన్’. REDANT క్రియేషన్ బ్యానర్పై నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ను క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.., అరవింద్ జాషువా రాసిన ‘పేషన్’ నవల చదివాను, అది చాలా అథెంటిక్గా ఉంది. ఈ చిత్రం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. అరవింద్లో స్టోరీ టెల్లింగ్, రైటింగ్ స్కిల్స్ అద్భుతం. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.
అరవింద్ జాషువా మాట్లాడుతూ, ఫ్యాషన్ కాలేజీలో సామాన్యుడి అనుభవాల నుంచి స్ఫూర్తి పొందిన కథ ఇది. శేఖర్ కమ్ముల నా గురువు, ఆయన స్ఫూర్తితోనే ఈ సినిమా తీశాను. నిర్మాతలు, సాంకేతిక బృందం అద్భుతంగా సహకరించారు. ఈ జనరేషన్కు కనెక్ట్ అయ్యే కథతో సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది అన్నారు.ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, శేఖర్ కమ్ముల సపోర్ట్కు ధన్యవాదాలు తెలిపారు. ఛాయా పబ్లికేషన్స్ ప్రచురించిన నవల స్ఫూర్తితో ఈ సినిమా రూపొందిందని చెప్పారు. సినిమా గొప్ప విజయం సాధించాలని టీమ్ ఆకాంక్షిస్తోంది.