
ఇద్దరు కథానాయికలు ఉన్న కథలు చేస్తున్న తెలుగు హీరోలు
వెండితెరపై హీరోలు ప్రేమ కోసం యుద్ధాలు చేస్తారు... త్యాగాలు చేస్తారు. అవçసరమైతేప్రాణాలు తీసుకుంటారు. అలాంటిది ఓ హీరోను ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తే ఏం చేస్తారు? ఏ అమ్మాయి ప్రేమకు ‘యస్’ చెబుతారు? అనేది పెద్ద సమస్య. ఇలాంటి సమస్యతో... ‘ఇద్దరమ్మాయిలతో’ అంటూ ‘డ్యూయెల్ లవ్’ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తున్న కొందరు హీరోలపై ఓ లుక్ వేయండి.
దొరబాబు లవ్వు
చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. ఈ సినిమాలో నలుగురుకిపైగా హీరోయిన్స్ నటిస్తున్నారని తెలిసింది. అయితే ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథన్ మాత్రం మెయిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం. ఇంకా ఈ సినిమాలో ఇషా చావ్లా, రమ్య పసుపులేటి వంటి హీరోయిన్లు ఉన్నప్పటికీ, వీరివి చిరంజీవి సిస్టర్స్ పాత్రలుగా ఉంటాయట.
ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని తెలిసింది. మరి... దొరబాబు ప్రేమను గెలిచేది ఎవరు? దొరబాబు ఇష్టపడేది ఎవర్ని? అనేది చూడాలి. ‘విశ్వంభర’లో సెంటిమెంట్తో పాటుగా ఉన్న లవ్ ట్రాక్ కూడా ఆడియన్స్ను అలరిస్తుందని సమాచారం. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందున్న ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ ఇది. భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్పై విక్రమ్ రెడ్డి, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
రాజాసాబ్ ఎవరి సొంతం?
‘రాజాసాబ్’తో ఇద్దరు హీరోయిన్స్ లవ్లో పడ్డారట. మరి... ‘రాజా సాబ్’ మనసులో ఎవరు ఉన్నారనేది? తెలియాలంటే మరికొంత సమయం వేచి ఉండాలి. ప్రభాస్ టైటిల్ రోల్ చేస్తున్న ఇంటెన్స్ హారర్ అండ్ కామెడీ ఫిల్మ్ ‘రాజా సాబ్’. మూడు తరాలు, ఆత్మలు వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో నటి రిద్ధీ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ సినిమాలోని హీరోయిన్స్ నిధీ–మాళవికా మోహనన్లతో హీరో ప్రభాస్కు లవ్ ట్రాక్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ నెలలో టీజర్ రిలీజ్ అవుతుందని, ఈ ఏడాది చివర్లో సినిమా విడుదలవుతుందని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ట్రిపుల్ లవ్
పన్నెండేళ్ల క్రితం అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో ఇద్దరమ్మాయిలుగా అమలాపాల్, కేథరిన్ నటించారు. అయితే ఇప్పుడు ముగ్గుర ు అమ్మాయిలతో సినిమా చేయనున్నారు అల్లు అర్జున్. కానీ... ముగ్గురు అమ్మాయిలతో అనేది సినిమా పేరు కాదు. అల్లు అర్జున్ హీరోగా నటించనున్న నెక్ట్స్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారట. అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది.
ఈ మూవీలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేయనున్నారని, ముగ్గురు హీరోయిన్స్ ఉంటారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. దీపికా పదుకోన్, అనన్యా పాండే, శ్రద్ధా కపూర్ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్గా ఏ ముగ్గురు హీరోయిన్స్ ఫిక్స్ అవుతారో చూడాలి. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదేప్రారంభించి, 2027లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, మేజర్ షూటింగ్ విదేశాల్లో జరుగుతుందని సమాచారం.
బెగ్గర్ లవర్ ఎవరు?
హీరో విజయ్ సేతుపతి, దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘బెగ్గర్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో టబు నటించనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కాగా ఇదే చిత్రంలో రాధికా ఆప్టే, నివేదా థామస్ కూడా నటించనున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. కథ రీత్యా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. మరి... బెగ్గర్ లవర్ ఎవరు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జాన్లోప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ను అరవైరోజుల్లోనే పూర్తి చేసి, ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారనే వార్తలు తెరపైకి వచ్చాయి.
రెండు సినిమాలు... నలుగురు హీరోయిన్స్
హీరో శర్వానంద్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటి స్తున్నారు. శర్వానంద్ చేస్తున్న మూడు సినిమాల్లో... రెండు చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘నారీ నారీ నడుమ మురారి’ అనే రొమాంటిక్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లు. ఇద్దరు అమ్మాయిల ప్రేమ మధ్య నలిగిపోయే యువకుడి పాత్రలో శర్వానంద్ నటిస్తున్నారని తెలుస్తోంది.
అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ‘భోగి’ అనే పీరియాడికల్ యాక్షన్ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా చేస్తున్నారు. ‘శతమానం భవతి’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో శర్వాందన్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ మళ్లీ ‘భోగి’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. అలాగే ఈ ‘భోగి’ చిత్రంలోనే మరో హీరోయిన్ డింపుల్ హయతి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. 1960 నేపథ్యంలో సాగే ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇంకా శర్వానంద్ హీరోగా అభిలాష్ కంకర దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘రేస్ రాజా’ (వర్కింగ్ టైటిల్) ఉన్న సంగతి తెలిసిందే.
ట్రయాంగిల్ లవ్స్టోరీ
ఇద్దరు అమ్మాయిల ప్రేమలో ఇరుక్కున్న ఓ అబ్బాయి కథ ఏంటో తెలియాలంటే ఈ నెల 9న విడుదలవుతున్న ‘సింగిల్’ సినిమా చూడాలి. ఈ చిత్రంలో శ్రీవిష్ణు హీరోగా, కేతికా శర్మ– ఇవానా హీరోయిన్లుగా నటించారు. పూర్వ పాత్రలో కేతికా శర్మ, హరిణి పాత్రలో ఇవానా కనిపిస్తారు. హీరో ఫ్రెండ్ పాత్రను ‘వెన్నెల’ కిశోర్ చేశారు. విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. కథ రీత్యా... హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు, మరో అమ్మాయి హీరోని ప్రేమిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఫైనల్గా హీరో ఏ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు? అనే అంశాలతో ఈ సినిమా ఉంటుందట.
యుద్ధం... ప్రేమ!
నిఖిల్ హీరోగా చేస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ సినిమాను భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ సినిమాలో సంయుక్త, నభా నటేశ్లు హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ ఇద్దరిలో సంయుక్త పాత్రకు యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఉంటాయని తెలిసింది. అలాగే ఈ మూవీలో మంచి లవ్ ఎపిసోడ్స్ ఉన్నాయని సమాచారం. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది. షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. తొలి భాగం ఈ ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఇలా ఇద్దరు హీరోయిన్స్ ప్రేమలో పడ్డ మరికొంత మంది హీరోల సినిమాలు ఉన్నాయి.