శ్రీమతి ఎంజీఆర్‌

New poster of Madhubala from Thalaivi unveiled on her birthday - Sakshi

మధుబాల మంచి నటి. ‘రోజా’, ‘జెంటిల్‌మేన్‌’ వంటి సినిమాలు చాలు.. ఆమె ఎంత మంచి నటో చెప్పడానికి. కథానాయికగా మంచి పాత్రలు చేసిన మధు ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ అలాంటి పాత్రలే చేస్తున్నారు. వచ్చే నెల 23న విడుదల కానున్న ‘తలైవి’లో ఆమె ఓ నిజజీవిత పాత్ర చేశారు. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. కంగనా టైటిల్‌ రోల్‌ చేశారు. ఇందులో ఎంజీఆర్‌ పాత్రను అరవింద్‌ స్వామి చేశారు. ఎంజీఆర్‌ సతీమణి జానకీ రామచంద్రన్‌ పాత్రను మధుబాల చేశారు. శుక్రవారం (మార్చి 26) మధుబాల బర్త్‌డే సందర్భంగా ఆమె లుక్‌ విడుదలైంది. ఆస్పత్రిలో ఎంజీఆర్‌ పక్కన కూర్చుని, ఆయన్ను చూస్తున్న జానకీ రామచంద్రన్‌ లుక్‌కి మంచి స్పందన లభించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top