Varun Dhawan-Kiara Advani: వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

Netizens Slams Varun Dhawan, Kiara Advani for Eating in Metro - Sakshi

బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌, హీరోయిన్‌ కియారా అద్వానీపై నెటిజన్లు మండిపడుతున్నారు. మెట్రో రైలులో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వీరి తీరుపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా వరుణ్‌-కియార జంటగా నటించిన తాజా చిత్రం 'జగ్‌ జగ్‌ జీయో'. రాజ్‌ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిగ్గజ నటులు అనిల్‌ కపూర్‌, నీతూ కపూర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా మూవీ టీం ముంబై మెట్రో రైలులో సందడి చేశారు. ఈ నేపథ్యంలో వరుణ్‌, కియారా మెట్రో రైల్లో వడ పావ్‌ తింటూ కనిపించారు.

చదవండి: చాలా మందికి అప్పు ఇచ్చా.. తిరిగి ఇవ్వలేదు : గోపీచంద్‌

ఈ వీడియోను ప్రముఖ మీడియా పర్సన్‌ వైరల్‌ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఇక మెట్రోలో నిబంధనలకు విరుద్ధం ప్రవర్తించిన కియార, వరుణ్‌లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మెట్రోలో ఆహార పదార్థాలు అనుమతి లేదనే విషయం కూడా తెలియదా?’, ‘వీరిపై మెట్రో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. వీరితో పాటు సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్, మూవీ యూనిట్‌ కూడా ఉన్నారు. కాగా కియారలో తెలుగులో రామ్‌ చరణ్‌ ఆర్‌సీ 15 మూవీతో పాటు ఇటీవల కోలీవుడ్‌లో ఓ సినిమాకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top