సీఎం చంద్రబాబును కలిసిన సినీ నటుడు నాగార్జున | Nagarjuna Met Chandrababu Naidu And Invited Him For His Son Akkineni Akhil Wedding, Photo Goes Viral | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబును కలిసిన సినీ నటుడు నాగార్జున

Jun 3 2025 1:08 PM | Updated on Jun 3 2025 1:35 PM

Nagarjuna Invited To Chandrababu Naidu For His Son Akhil Wedding

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును సినీ నటుడు నాగార్జున కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ను కలిసి తన చిన్న కుమారుడు అఖిల్‌ వివాహానికి హాజరు కావాలని నాగార్జున ఆహ్వానించారు. గతేడాది నవంబర్‌లో అఖిల్‌ నిశ్చితార్థం జైనబ్‌ రవ్జీతో జరిగిన విషయం తెలిసిందే. జూన్‌ 6న వారి వివాహం జరగనుంది. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. జూన్‌ 8న రిసెప్షన్‌ జరగనున్నట్లు సమాచారం. నాగార్జున ఇప్పటికే తన కుటుంబ సభ్యులతో పాటు  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి శుభలేఖ అందించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement