మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్‌ నేరుగా ఓటీటీలోకి.. | Mrunal Thakur Pooja Meri Jaan Movie Finally Gets OTT Release After Four Years | Sakshi
Sakshi News home page

OTT Thriller : ఓటీటీలో మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Sep 20 2026 2:13 PM | Updated on Sep 20 2026 2:39 PM

Mrunal Thakur Pooja Meri Jaan Movie Finally Gets OTT Release After Four Years

స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్, కోర్ట్‌రూమ్ డ్రామా ‘పూజా మేరీ జాన్’ ఎట్టకేలకు ఓటీటీ బాట పట్టింది. దాదాపు నాలుగేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పలు కారణాలతో థియేటర్లలో విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు ఎలాంటి థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది.
గాంధీ జయంతి సందర్భంగా
జీ5 వేదికగా అక్టోబర్ 2 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. గాంధీ జయంతి సందర్భంగా హిందీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనంతరం తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ తాజాగా వెల్లడించారు. ‘కొన్ని కథలు మీరు చూసే విషయాలనే అనుమానించేలా చేస్తాయి. మరికొన్ని మీరు నమ్మే విషయాలను ప్రశ్నించేలా చేస్తాయి. కానీ ఈ కథ మాత్రం వాటి మధ్యలో ఉన్న ప్రతిదానినీ ప్రశ్నించేలా చేస్తుంది’ అంటూ మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
విభిన్నమైన కథాంశంతో..
నవజ్యోత్ గులాటీ, విషాషా అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్‌తో పాటు హుమా ఖురేషీ, విక్రమ్ సింగ్ చౌహాన్, విజయ్ రాజ్, చైతన్య వ్యాస్, రాజేష్ జైస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దినేష్ విజన్‌కు చెందిన మడాక్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మృణాల్ ఠాకూర్ కెరీర్‌లో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రంగా ‘పూజా మేరీ జాన్’ నిలవనుంది. థియేటర్లలో విడుదల కాకపోవడంతో ఇన్నాళ్లుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌తో క్లారిటీ వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement