'ఆదిపురుష్'.. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు | Manoj Muntashir Reacts Adipurush Issue Latest | Sakshi
Sakshi News home page

Manoj Muntashir-Adipurush: దేశ ప్రజలకు సారీ చెబుతున్నా

Jul 25 2026 9:00 PM | Updated on Jul 25 2026 9:06 PM

Manoj Muntashir Reacts Adipurush Issue Latest

'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేసిన సినిమాల్లో 'ఆదిపురుష్' ఒకటి. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో రిలీజైనప్పుడే కాదు ఇప్పటికీ ట్రోల్ అవుతూనే ఉంటుంది. విజువల్స్ ఎఫెక్ట్స్ టాపిక్ వచ్చిన ప్రతిసారి నెటిజన్లు ఓం రౌత్‌ని ఇష్టమొచ్చినట్లు తిడుతూనే ఉంటారు. అయితే ఈ చిత్రానికి పనిచేసిన పాటల రచయిత, జాతీయ అవార్డ్ గ్రహీత మనోజ్ ముంతాశిర్.. అప్పట్లో మూవీ టీమ్‌కి అండగా మాట్లాడాడు. ఇప్పుడు మాత్రం జనాలకు సారీ చెబుతూ, ఈ మూవీ చేయడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

'మొదట్లో వచ్చిన విమర్శలని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ రెండు రోజుల్లోనే ప్రజల ఆవేదన అర్థమైంది. 'ఆదిపురుష్' నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. ఆ సినిమాని విడుదల తర్వాత సమర్థించడం అంతకంటే పెద్ద తప్పు. ఆ సినిమా చుట్టూ జరిగిన పరిణామాలన్నింటికీ చాలా సిగ్గుపడుతున్నా. జరిగిన దానికి దేశ ప్రజలందరినీ క్షమాపణలు కోరుతున్నా'

సినిమాలోని సంభాషణలపై వచ్చిన విమర్శలని గుర్తు చేసుకున్న ఈయన.. 'ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ డైలాగ్స్ నేను ఎలా రాశానో నాకు కూడా అర్థం కావడం లేదు. వాటిని రాసినందుకు చాలా సిగ్గుగా ఉంది. అలాగే శ్రీరాముడు, హనుమంతుడు లాంటి పవిత్ర పాత్రలకు నేను ఏ మాత్రం న్యాయం చేయలేకపోయాను. ఆ టైంలో నేను మాట్లాడిన మాటలు, ముఖ్యంగా హనుమంతుడికి సంబంధించిన వ్యాఖ్యలని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు'

(ఇదీ చదవండి: నా కొడుకుతో 'సిసింద్రీ 2' సినిమా చేస్తా: అఖిల్)

''ఆదిపురుష్'కు మద్దతుగా మాట్లాడొద్దని నా భార్య ముందుగానే హెచ్చరించింది. సినిమా విడుదలకు దాదాపు ఆరునెలల ముందే సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. సినిమా తీయడంపై ప్రేక్షకుల్లో చాలా సందేహాలు వచ్చాయి. అలాంటి టైంలో నేను మూవీని సమర్థిస్తే మొత్తం వ్యతిరేకత నాపై పడుతుందని నా భార్య చెప్పింది' అని పాటల రచయిత మనోజ్ ముంతాశిర్ చెప్పుకొచ్చాడు.

2023 జూన్‌లో 'ఆదిపురుష్' రిలీజైంది. రామాయణం ఆధారంగా ఈ సినిమా తీశారు. శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటించారు. వీరిలో రాముడు, రావణుడి పాత్రలపై వచ్చిన ట్రోల్స్ అన్నిఇన్నీ కావు. అయినా సరే రూ.400 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు టెక్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement