మహేశ్బాబు హీరోగా నటిస్తున్న ‘వారణాసి’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. రాజమౌళి దర్శకత్వంలో కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇందులో రుద్ర, శ్రీరాముడు.. ఇలా రెండు పాత్రల్లో కనిపించనున్నారు మహేశ్బాబు.
మందాకినిగా ప్రియాంకా చోప్రా, విలన్ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తుండగా, ప్రకాష్రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందని తెలిసింది. ‘వారణాసి’లో తన వంతు షూట్ను పూర్తి చేయడానికి మహేశ్బాబు 15 రోజులు షూటింగ్లో పాల్గొంటే సరిపోతుందట. అక్టోబరు కల్లా మొత్తం చిత్రీకరణ పూర్తవుతుందని ఇటీవల ఓ కార్యక్రమంలో ఎస్ఎస్ కార్తికేయ పేర్కొన్నారు.


