‘మధురం’ పోస్టర్ ప్రామిసింగ్గా ఉంది: విశ్వక్ సేన్
ఉదయ్, వైష్ణవి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మధురం’. శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై బంగార్రాజు ఎం నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ చికిలే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ని మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేసి టీమ్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
‘పోస్టర్ చూడటానికి చాలా ప్రామిసింగ్ గా ఉంది. నాకు కూడా ఈ మూవీ చూడాలని చాలా క్యూరియాసిటీ గా ఉంది’అని విశ్వక్ అన్నారు. అడగగానే పెద్దమనసుతో ఒప్పుకొని ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేసిన విశ్వక్సేన్కు ఎప్పుడు రుణపడి ఉంటామని చిత్రబృందం పేర్కొంది.