Keerthy Suresh : శింబుతో రొమాన్స్‌ చేయనున్న కీర్తి సురేష్‌!

Keerthy Suresh To Romance With Simbu In Her Next Movie - Sakshi

తమిళసినిమా: మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌ను చుట్టేస్తున్న కథానాయికల్లో కీర్తి సురేష్‌ ఒకరు. తక్కువ కాలంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న నటి ఈమె. ఇంకా చెప్పాలంటే మహానటి వంటి చిత్రాల్లో స్థాయికి మించిన పాత్రలను పోషించి మెప్పించింది. పక్కింటి అమ్మాయిగా ముద్ర వేసుకున్న కీర్తీ సురేష్‌ ఇటీవల గ్లామర్‌పై మొగ్గు చూపే ప్రయత్నం చేస్తుంది. స్పెషల్‌ ఫొటో షూట్‌ చేయించుకుని మరీ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తోంది. అయితే ఇటీవల ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయనే టాక్‌ వినిపిస్తోంది.

తెలుగులో నానికి జంటగా నటించిన దసరా చిత్రం పూర్తి కావస్తోంది. భోళా శంకర్‌ చిత్రంలో చిరంజీవికి చెల్లిగా నటిస్తున్న చిత్రం కూడా చివరిదశలో ఉంది. కాగా అక్కడ ప్రస్తుతానికి కీర్తీ సురేష్‌ చేతిలో మరో చిత్రం లేదు. ఇక మలయాళంలో కూడా ఏ చిత్రం చేయడం లేదు. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటిస్తున్న మామన్నన్‌ చిత్రం ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇలాంటి సమయంలో మరో లక్కీ ఛాన్స్‌ సురేష్‌కు వరించినట్లు సమాచారం.

కన్నడంలో కేజీఎఫ్, ఎజీఎఫ్‌–2 కాంతార వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను నిర్మించిన హోంబలి ప్రొడక్షన్స్‌ సంస్థ తమిళంలో శింబు కథానాయకుడుగా ఒక భారీ చిత్రాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సూరరై పోట్రు చిత్రం ఫేమ్‌ సుధా కొంగర దర్శకత్వం వహించనున్నారు. ఇందులో శింబుకు జంటగా కీర్తిసురేష్‌ నటించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటనను చిత్ర వర్గాలు దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top