కీర్తీ సురేష్ సినిమా.. డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల | Keerthy Suresh Movie Uppu Kappurambu OTT Release | Sakshi
Sakshi News home page

కీర్తీ సురేష్ సినిమా.. డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల

Jul 27 2024 7:58 PM | Updated on Jul 27 2024 8:06 PM

Keerthy Suresh Movie Uppu Kappurambu OTT Release

హీరోయిన్‌  కీర్తీ సురేశ్‌‌ మెయిన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న కొత్త సినిమా ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో  సుహాస్‌ మరో లీడ్‌ రోల్‌లో కనిపిస్తారు. ఐవీ శశి దర్శకత్వంలో తెరకెక్కుత్ను ఈ చిత్రాన్ని రాధికా లావు  నిర్మించారు. వసంత్‌ మురళీ కృష్ణ మరింగంటి కథ అందిస్తున్నారు.

ఓ గ్రామంలోని స్మశానం విస్తరణ నేపథ్యంలో ‘ఉప్పు కప్పురంబు’ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలో కీర్తీ సురేశ్‌, సుహాస్‌ జంటగా నటిస్తారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే.  అయితే, ఉప్పు క‌ప్పురంబు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ కోస‌మే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

 తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో కూడా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ ఏడాదిలోనే  ఈ సినిమా విడుదల కానుంది. త్వరలోనే మరిన్ని విషయాలు ఉప్పు కప్పురంబు మేకర్స్‌ వెల్లడించనున్నారు. కీర్తీ సురేశ్‌ నటించిన ర‌ఘుతాత సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. మరోవైపు బేబీ జాన్‌ సినిమాతో ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement