
సినీనటి హేమ (Actress Hema) తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కరాటే కల్యాణి (Karate Kalyani), తమన్నా సింహాద్రి సహా పలు యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు పంపింది. గతంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిందంటూ కల్యాణిపై రూ.5 కోట్ల పరువునష్టం దావా వేసింది. తాజాగా ఈ వ్యవహారంపై నటి కరాటే కల్యాణి స్పందించింది.
ఉన్నదే చెప్పా..
ఆమె మాట్లాడుతూ.. నేనేమీ పార్టీలకు, పబ్బుకు వెళ్లలేదు. నాకు మద్యం అలవాటు కూడా లేదు. ఏ తప్పూ చేయనప్పుడు నేనెందుకు భయపడాలి? బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పట్టుబడిందని మీడియాలో వచ్చిన వార్తలు చూసే మాట్లాడాను. గతంలో ఆమె నన్ను కించపరుస్తూ చాలాసార్లు మాట్లాడింది. నన్ను చులకనగా చూసేది. మరి నువ్వేంటక్కా? ఇలా దొరికిపోయావు? అని అప్పుడు ఓ వీడియో చేశాను. మీడియాలో చూసిందే పెట్టాను తప్ప సొంతంగా సృష్టించలేదు కదా!
భయమా?
అలాంటప్పుడు ఆమె మీడియాపై కేసు వేయాలి కానీ నాపై వేయడం దేనికి? మీడియా అంటే భయమా? మీడియాను ఏం అనలేక నాపై కేసు వేద్దామనుకున్నావా? లేదా ఈ మధ్య ఎవరూ నిన్ను పట్టించుకోవడం లేదని అటెన్షన్ కోసం ఈ పని చేశావా? మీరు లీగల్ నోటీసులు పంపినంత మాత్రాన నేను భయపడను. నేను తగ్గేరకం కాదు. నేను కూడా తనకు నోటీసులు పంపుతాను అని కరాటే కల్యాణి చెప్పుకొచ్చింది.