హిట్ చిత్రాల దర్శకుడితో కమల్ మూవీ?
విక్రమ్ చిత్రం అందించిన విజయోత్సవంతో నటుడు కమలహాసన్ వరుస చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరో పక్క బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోకు హోస్ట్గా వ్యహరిస్తూ బిజీగా ఉన్నారు. కాగా ఇండియన్ 2 చిత్రాలు పూర్తి చేసిన తర్వాత మలయాళ దర్శకుడు మహేష్ నారాయణన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నారు.
కాగా ఆ తర్వాత చేసే చిత్రానికి కూడా కమల్హాసన్ పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. అజిత్ కథానాయకుడిగా నేర్కొండ పార్వై, వలిమై వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు హెచ్ వినోద్ ప్రస్తుతం అదే అజిత్ హీరోగా తుణివు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి ఈయన కమల్హాసన్ను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్ర కథను దర్శకుడు హెచ్.వినోద్ ఇటీవల కమల్హాసన్కు వినిపించారని, ఆయన నటించడానికి సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఒక యాక్షన్ గేమ్ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని కోలీవుడ్ వర్గాల టాక్. కాగా తుణివు చిత్రం విడుదల తర్వాత కమలహాసన్ హీరోగా నటించే చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.