ఆ సీన్స్‌లో నా కన్నీళ్ళు నిజం: ఈషా రెబ్బా | Eesha Rebba about Om Shanthi Shanthi Shanthi | Sakshi
Sakshi News home page

ఆ సీన్స్‌లో నా కన్నీళ్ళు నిజం: ఈషా రెబ్బా

Jan 27 2026 12:11 AM | Updated on Jan 27 2026 12:11 AM

Eesha Rebba about Om Shanthi Shanthi Shanthi

తరుణ్‌ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళ హిట్‌ ఫిల్మ్‌ ‘జయ జయ జయ జయహే’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఏఆర్‌ సజీవ్‌ దర్శకత్వంలో సృజన్‌ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్‌ కృష్ణని, అనుప్‌ చంద్రశేఖరన్, సాధిక్‌ షేక్, నవీన్‌ సనివరపు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న కానుంది. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈషా రెబ్బా మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో శాంతి అనే పాత్ర చేశాను.

ఇలాంటి క్యారెక్టర్‌ చేయాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాను. నా హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎఫర్ట్స్‌ పెట్టాను. ఈ సినిమాలో నేను చెంపదెబ్బలు తిన్న సీన్స్‌ ఉన్నాయి. ఆ సీన్స్‌లో నా కళ్ళలో వచ్చిన నీళ్ళు రియల్‌. ఈ సినిమాలో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంది. ఈ సీన్‌లో తరుణ్‌ భాస్కర్‌కి, నాకూ దెబ్బలు తగిలాయి. సంజీవ్‌ క్లియర్‌ విజన్‌ ఉన్న దర్శకుడు. ప్రస్తుతం తెలుగులో కథలు వింటున్నాను. ఒక తమిళ చిత్రంలో నటిస్తున్నాను’’ అని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement