వివాదంలో 'అక్షయ్ ఖన్నా'.. నిర్మాత నోటీసులు జారీ | Drishyam 3 Producer Slams Akshaye Khanna Behaviour | Sakshi
Sakshi News home page

వివాదంలో 'అక్షయ్ ఖన్నా'.. నిర్మాత నోటీసులు జారీ

Dec 28 2025 5:28 PM | Updated on Dec 28 2025 5:38 PM

Drishyam 3 Producer Slams Akshaye Khanna Behaviour

బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ ఖన్నా వివాదంలో చిక్కుకున్నారు. ఏడాదిలో ఛావా, ధురందర్చిత్రాలతో ఆయనకు పాన్ఇండియా రేంజ్లో గుర్తింపు దక్కింది. అయితే, బాలీవుడ్ సినిమా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న మూడవ భాగం ‘దృశ్యం -3’ నుంచి ఆయన ఆకస్మికంగా తప్పుకోవడంతో అక్షయ్ ఖన్నాకు నిర్మాత మంగత్ పాఠక్ నోటిసులు పంపిన‌ట్లు తెలుస్తుంది. మూవీ వచ్చే ఏడాది అక్టోబర్లో విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్దశలో ఉంది.

హిందీదృశ్యం -2’లో  అక్షయ్ ఖన్నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అందుకే పార్ట్‌-3లో కూడా ఆయనే నటించాలని ముందుగానే ఢీల్సెట్చేసుకున్నామని పాఠక్చెప్పారు. మేరకు అక్షయ్ఖన్నాకు అడ్వాన్స్కూడా ఇచ్చామన్నారు. అయితే, షూటింగ్ ప్రారంభం కావాల్సిన టైమ్లో అక్షయ్ఖన్నా తమకు షాకింగ్మెసేజ్చేశాడని నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను నటించడం లేదంటూ ఒక టెక్స్ట్ మెసేజ్ పంపినట్లు చెప్పుకొచ్చాడు. క్రమంలో తనను సంప్రదించాలని ప్రయత్నం చేసినప్పటికీ అక్షయ్ అందుబాటులోకి రాకపోవడంతో చేసేదేమీ లేక చట్టపరమైన చర్యలకు దిగాల్సి వచ్చిందని నిర్మాత చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే, మూవీ కోసం అక్షయ్ఖన్నా రూ. 22 కోట్లు రెమ్యునరేషన్డిమాండ్చేసినట్లు తెలుస్తోంది.

అక్షయ్‌ ఖన్నాకి సినిమా అవకాశాలు రానప్పుడు ‘సెక్షన్ 375‌’ మూవీతో మంగత్పాఠక్లైఫ్ఇచ్చాడు. ఆ తర్వాతే అతనికి మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత ‘దృశ్యం 2’ భారీ విజయం అందుకోవడంతో ఛావా, ధురంధర్వంటి సినిమాలు దక్కాయి. ఇదే విషయాలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement