తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బన్నీ భార్య.. వీడియో వైరల్! | Allu Arjun Wife Visits Tirumala With Her Childrens Ayan and Arha | Sakshi
Sakshi News home page

Allu Arjun Wife In Tirumala: అయాన్‌, అర్హతో కలిసి శ్రీవారి సేవలో స్నేహ రెడ్డి..!

Aug 6 2024 3:13 PM | Updated on Aug 6 2024 3:50 PM

Allu Arjun Wife Visits Tirumala With Her Childrens Ayan and Arha

టాలీవుడ్ హీరో, అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పిల్లలు అయాన్‌, అర్హలతో కలిసి తిరుమల స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి స్వామివారి దర్శన ‍అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందిన్‌కాగా.. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2: ది రూల్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పుష్పకు సీక్వెల్‌గా  సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలుసార్లు  వాయిదా పడినా మూవీ డిసెంబర్‌ 6న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే పుష్ప-2 షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ కూడా ఇ‍చ్చారు మేకర్స్‌. రిలీజ్‌ తేదీలోనూ ఎలాంటి మార్పులేదని మరోసారి ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement