
ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025
8లో
న్యూస్రీల్
పాపన్నపేట(మెదక్): మంజీరా జోరు తగ్గలేదు. సింగూ రు నీరు పోటెత్తుతుండటంతో ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లుతోంది. దుర్గమ్మ ఆలయాన్ని ముంచెత్తుతూ మంజీరా పరవళ్లు తొక్కుతోంది. మూడో రోజు శనివారం కూడా రాజగోపురంలోనే దుర్గమ్మకు పూజలు నిర్వహించారు. కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, సిబ్బందితో కలిసి ఏడుపాయలలో వరద పరిస్థితిని సమీక్షించారు. వరుస వర్షాలతో ఎగువ నుంచి సింగూరులోకి 31,400 క్యూసెక్కుల వరద చేరుతుంది. దీంతో ఇరిగేషన్ అధికారులు 6, 8, 9, 10, 11 నంబర్ గేట్లు ఎత్తి 43,300 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. గత రెండు రోజుల కన్నా వరద ఉధృతి పెరిగింది. రాజగోపురంలో దుర్గ మ్మ ఉత్సవ విగ్రహానికి భక్తులు పూజలు చేస్తున్నారు. జలకళను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఏడుపాయల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారు లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
జోరు తగ్గని మంజీరా
జలదిగ్బంధంలో దుర్గమ్మ
రాజగోపురంలోనే పూజలు
పరిస్థితిని సమీక్షించిన
జిల్లా యంత్రాంగం

ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025

ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025

ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025