జోరుగా అక్రమ కలప వ్యాపారం | - | Sakshi
Sakshi News home page

జోరుగా అక్రమ కలప వ్యాపారం

Apr 29 2025 9:29 AM | Updated on Apr 29 2025 10:07 AM

జోరుగా అక్రమ కలప వ్యాపారం

జోరుగా అక్రమ కలప వ్యాపారం

రేగోడ్‌(మెదక్‌): అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కులకు వరంగా మారింది. ఇంకేముంది యథేచ్ఛగా కలప రవాణా చేస్తూ జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేగోడ్‌ మండలంలో అక్రమ కలప వ్యాపారం మూడు పూవులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. రేగోడ్‌తో పాటు ఆయా గ్రామాలు, తండాల సమీపంలోని ‘చెట్లన్నింటిని ఖతం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెట్లను నరకాలంటే సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇష్టారాజ్యంగా చెట్లను నరికివేయడంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి హరితహారంలో మొక్కలు నాటుతుంటే.. మళ్లీ నరికేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై పెద్దశంకరంపేట ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ రమేశ్‌ను సోమవారం వివరణ కోరగా విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement