
రజతోత్సవ సభకు తరలిరండి
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి
నిజాంపేట(మెదక్): రేపు వరంగల్లో జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయా లని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. 2001లో గులాబీ జెండా పట్టుకున్న కేసీఆర్ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఢిల్లీ నాయకుల మెడలు వంచి తెలంగాణ సాధించారని కొనియాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఏడాదిన్నర కాలంలోనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పోలీ సులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. అధికార పార్టీకి అధికారులు మొగ్గు చూ పడం సరికాదని హితవు పలికారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, నాయకులు నాగరాజు, స్వామి, దయాకర్, గౌస్, దుబ్బ రాజాగౌడ్, రంజిత్గౌడ్, రాజు, మాధవరెడ్డి పాల్గొన్నారు.