
మే నెల సెలవు ఇవ్వండి
మెదక్ కలెక్టరేట్: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మిని టీచర్లు అందరికీ మే నెల అంతా ఒకేసారి సెలవులు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలను ఇళ్లలో ఉంచడమే మంచిదన్నారు. కర్ణాటకలో మే నెల అంతా అంగన్వాడీ సెంటర్లకు వేసవి సెలవులు ప్రకటించారని గుర్తు చేశారు. లేదంటే టేక్ హోం రేషన్ ద్వారా ఇంటింటికీ సరుకులు పంపిణీ చేయాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేష్కు వినతి పత్రం అందజేశారు. సీఐటీయూ నాయకుడు మల్లేశం సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు అన్నపూర్ణ ,తదితరులు పాల్గొన్నారు.