
భూ భారతి రైతులకు వరం
నేడు భూభారతి అవగాహన సదస్సు
మే 20వరకు పూర్తి చేయాలి
‘యువ వికాసం’ దరఖాస్తులపై కలెక్టర్
కుర్తివాడ అనాథ పిల్లలను ఆదుకుంటాం
రామ్, అరుణ్ గుప్తా ఫ్యామిలీ ఫౌండేషన్ సభ్యులు
రేగోడ్/పెద్దశంకరంపేట(మెదక్): భూ భారతి చట్టం రైతులకు, పేద ప్రజలకు వరమని, రైతుల భూ సమస్యల పరిష్కరించడానికి ప్రజల వద్దకే అధికారులు వెళ్తారని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. మండల కేంద్రమైన రేగోడ్లోని రైతు వేదిక కార్యాలయంలో, పెద్దశంకరంపేటలో మంగళవారం భూ భారతి చట్టంపై ప్రజలు, రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి సందేశాన్ని టీవీ ద్వారా వినిపించారు. అనంతరం కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ద్వారా ఎలాంటి సమస్యలైనా పరిష్కరిస్తామని, భూ కబ్జాలు, అక్రమాలు, వివాదాలు తొలగించి, శాటిలైట్ ద్వారా మ్యాప్లు పట్టా పాస్బుక్లో పొందుపర్చుతామని అన్నారు. పౌతి అమలు వంటిని పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జూన్ 2నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. ఆధార్ లింకు ద్వారా భూధార్ కార్డులు ఇస్తామన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. గతంలో పెద్దశంకరంపేట ప్రాంతంలో రాణి శంకరమ్మ భూములు పేద రైతులకు దక్కకుం డా ధరణి ద్వారా భూస్వాముల పరమయ్యాయని అన్నారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని, బీఆర్ఎస్ పార్టీ బినామీలకు పట్టాలు అందించిందన్నారు. అనంతరం రేగోడ్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ రాహుల్రాజ్ తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, ఆస్పత్రికి వచ్చే రోగుల వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమాల్లో ఆర్డీఓ రమాదేవి, పీసీసీ సభ్యుడు ఎం.కిషన్, ఆర్అండ్బీ ఈఈ సర్దార్ సింగ్, తహసీల్దార్ దత్తరెడ్డి, ఇన్చార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సీతారావమ్మ, ఇన్చార్జి ఎంపీడీఓ విఠల్రెడ్డి, ఏఓ జావిద్, ఆర్ఐలు ఫెరోజ్, విజయలక్ష్మి, సీనియర్ నాయకులు సురేందర్రెడ్డి, మధు, నారాగౌడ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షు రాలు భవానీ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎస్.దిగంబర్రావు, తదితరులు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం భూ భారతిపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ మన్నన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కలెక్టర్ రాహుల్రాజ్ హాజరుకానున్నారని తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
మెదక్ కలెక్టరేట్: రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు విచారణ ప్రక్రియ మే 20వ తేదీ వరకు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టర్ తన చాంబర్లో జిల్లా, మండల స్థాయిలో విచారణ టీంల ఏర్పాటుపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం యూనిట్లు ఏర్పాటు చేసే లబ్ధిదారులకు బ్యాంకర్లు రుణాలు అందించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 32,640 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. తుది జాబితా ఆయా కార్పొరేషన్కు పంపనున్నట్లు తెలిపారు. యూనిట్లు ఏర్పాటును బట్టి ఎంపిక చేసిన లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
నెలాఖరులోగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి
అనంతరం హైదరాబాద్ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌతమ్లతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలోఅదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్రావు, జెడ్పీసీఈఓ ఎల్లయ్య, ఆర్డీఓ రమాదేవి, నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్రెడ్డిలతోపాటు ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పాపన్నపేట(మెదక్): పాపన్నపేట మండలం కుర్తివాడ అనాథ బాలికలను అన్ని విధాలుగా ఆదుకుంటామని రామ్, అరుణ్ గుప్తా ఫ్యామిలీ ఫౌండేషన్ సభ్యులు తెలపారు. మంగళవారం వారు బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనాథ బాలికలను కుర్తివాడలో కలసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ముగ్గురు పిల్లలకు విద్యాభ్యాసం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కావాల్సిన ఆర్థిక వనరులు సమాకూరుస్తామని హామీ ఇచ్చారు.
ప్రజల వద్దకే అధికారులు వెళ్తారు
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
కలెక్టర్ రాహుల్రాజ్

భూ భారతి రైతులకు వరం