
ఆధార్లా ‘భూధార్’ కార్డు
నర్సాపూర్/శివ్వంపేట: ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూ భారతి చట్టంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం నర్సాపూర్ రైతు వేదిక, శివ్వంపేటలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎవరు బాధపడొద్దన్నారు. సాదా బైనామాలు పరిష్కరించేందుకు త్వరలో మార్గదర్శకాలు రానున్నాయని తెలిపారు. ఆధార్ కార్డు మాదిరిగా భూములకు భూధార్ నంబర్ రానుందని, హద్దులు సైతం వస్తాయని వివరించారు. జూన్ 2 నుంచి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఏమైన సమస్యలు ఉంటే రెవెన్యూ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి ద్వారా అసలైన పట్టాదారులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సన్నబియ్యం సరఫరా, యాసంగి ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అనంతరం నర్సాపూర్ మండలంలోని చిప్పల్తుర్తి కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసి బాలికలతో కలిసి భోజనం చేశారు. మెనూ పక్కాగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్ నగేష్ ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏడీఏ సంధ్యారాణి, ఎంపీడీఓ మధులత, ప్యాక్స్ చైర్మన్ రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త చట్టంపై అవగాహన అవసరం
కలెక్టర్ రాహుల్రాజ్
పాఠశాల అభివృద్ధి అభినందనీయం
శివ్వంపేట(నర్సాపూర్): ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శివ్వంపేట ప్రాథమిక పాఠశాలను గ్రామానికి చెందిన నవీన్గుప్తా సొంత నిధులతో మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దడం గొప్ప విషయమని కొనియాడారు.

ఆధార్లా ‘భూధార్’ కార్డు