
అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలు
మెదక్ మున్సిపాలిటీ: అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారి వెంట ఉండే గ్రామాల ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్యాసింజర్ వాహనాలపై పరిమితికి మించి ప్రయా ణికులను ఎక్కించడం, అధిక లోడుతో వాహనాలు నడపడం ప్రమాదకరం అన్నారు. రహదారులపై వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో నిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు, కేసులు నమో దు చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. హెల్మెట్, సీటు బెల్ట్ విధిగా పెట్టుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలన్నారు.
ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి