
అంచెలంచెలుగా అభివృద్ధి పనులు
● మంత్రి దామోదర రాజనర్సింహ
రాయికోడ్(అందోల్): రాష్ట్రంలో అంచెలంచెలుగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి దా మోదర రాజ నర్సింహ అన్నారు. శుక్రవారం రాయికోడ్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ కచూరిరావు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై మాట్లాడారు. ఆత్మ కమిటీ సభ్యులు నెలకో మండలంలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకొని తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
త్వరలోనే నీటి ప్రాజెక్టుల పనులు
ప్రజారోగ్య భద్రతలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలు మంజూరు చేయగా ఆ పనులు కొనసాగుతున్నాయని మంత్రి దామోదర చెప్పారు. త్వరలోనే మునిపల్లి, రా యికోడ్ మండలాల్లోని రైతులకు సాగు నీరు అందించే ప్రాజెక్టుల పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. సన్నబియ్యం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించామన్నారు. రేషన్ కార్డుల జారీ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.