
బీఆర్ఎస్ హయాంలో విద్య, వైద్యంపై నిర్లక్ష్యం
రామాయంపేట(మెదక్)/చిన్నశంకరంపేట/ పాపన్నపేట: బీఆర్ఎస్ హయాంలో విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేశారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ విమర్శించారు. బుధవారం ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన బేటీ బచావో– బేటీ పడావో కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నశంకరంపేట, గవ్వలపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, అలాగే.. పాపన్నపేట మండలం పొడిచన్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం, మత్స్య సహకార భవనాన్ని ప్రారంభించారు. మెదక్లో మెడికల్ కళాశాలతోపాటు రామాయంపేటకు రూ.200 కోట్లతో ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించానన్నారు. అనంతరం అంగన్వాడీ పిల్లలకు పోషణ పక్షం క్యాలెండర్తో పాటు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
దళారులను నమ్మొద్దు
ధాన్యం కొనుగోలు విషయంలో దళారులను నమ్మొద్దని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అనంతరం కొత్తపల్లిలో ఇటీవల మరణించిన త్యార్ల సుజాత సంస్మరణ సమావేశంలో పాల్గొని నివాళులు అర్పించారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.