
వైద్య వృత్తి మహోన్నతమైనది
మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేటఅర్బన్: వైద్య వృత్తి మహోన్నతమైనదని, వృత్తిలో రాణించి తల్లిదండ్రులకు, సమాజానికి గొప్ప పేరు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం మిట్టపల్లి సమీపంలో సురభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మొదటి గ్రాడ్యుయేషన్ వేడుకలకు మంత్రితో పాటు ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే హరీష్రావు, యూనివర్సిటీ వీసీ నందా కుమార్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్దిమందికి మాత్రమే డాక్టర్గా అయ్యే అవకాశం ఉంటుందన్నారు. కనబడే దేవుళ్లు డాక్టర్లేనని అన్నారు. గతంలో మెడికల్ కాలేజీ లు తక్కువగా ఉండేవని తెలంగాణ వచ్చాక చాలా కాలేజీలు వచ్చాయన్నారు. నేటి విద్యార్థులు డాక్టర్లు అవ్వాలని, తల్లిదండ్రుల కోరిక నెరవేర్చడంతో పాటు సామాజిక బాధ్యతతో వైద్యం అందించాలని అన్నారు. డాక్టర్లుగా వెళ్తున్న 2019 బ్యాచ్ విద్యార్థులు మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సురభి మెడికల్ కాలేజీ చైర్మన్ హరిందరావు, మహేందర్ రావు, మనోహర్ రావు, డీన్ రఫీ, మెడికల్ డైరెక్టర్ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు.