ఎకై ్సజ్‌ కార్యాలయం ఏదీ? | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ కార్యాలయం ఏదీ?

Apr 8 2025 7:09 AM | Updated on Apr 8 2025 7:09 AM

ఎకై ్సజ్‌ కార్యాలయం ఏదీ?

ఎకై ్సజ్‌ కార్యాలయం ఏదీ?

అల్లాదుర్గం(మెదక్‌): 2016 పునర్విభజనలో భాగంగా అల్లాదుర్గంలో ఎకై ్సజ్‌ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. తొమ్మిదేళ్లు గడిపోయినా ఇప్పటికీ మంజూరు కాలేదు. ఎకై ్సజ్‌ అధికారులు ఇక్కడి రావాలంటే 60 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో కల్తీ కల్లు, గంజాయి విక్రయంపై నిఘా కొరవడిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం అల్లాదుర్గంలో సబ్‌ డివిజన్‌ కార్యాలయాలు ఏర్పాటు చేసింది. అల్లాదుర్గం సర్కిల్‌ కేంద్రంగా టేక్మాల్‌, రేగోడ్‌, పెద్దశంకరంపేట మండలాలను కలుపుతూ పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయం, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌ సబ్‌ డివిజన్‌, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాలతో పాటు, జూనియర్‌ సివిల్‌ ప్రథమ శ్రేణి జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పునర్విభజనకు ముందు ఈ మండలాలు జోగిపేట సర్కిల్‌ పరిధిలో ఉండేవి. కాగా అల్లాదుర్గంలో పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయం 2016లోనే ఏర్పాటు చేశారు. ఎకై ్సజ్‌ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. అయితే అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో అది కలగానే మిగిలింది. అయితే అల్లాదుర్గంలో కార్యాలయం ఏర్పాటు చేయడానికి పాత పోలీస్‌స్టేషన్‌ భవనం వాడుకోవచ్చని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ భవనం వృథాగా ఉందన్నారు. ఇదే విషయమై జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా.. అల్లాదుర్గంలో ఎకై ్సజ్‌ కార్యాలయం మంజూరుకు గతంలో ప్రతిపాదనలు పంపిన విషయం వాస్తవమేనని అన్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం కొన్నిస్టేషన్లను మంజూరు చేసిందని.. జిల్లాకు మాత్రం మంజూరు కాలేదన్నారు. జిల్లాలో గంజాయి సాగు చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కల్తీ కల్లు విక్రయాలపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. రహదారుల పక్కన కల్లు విక్రయించకూడదని అన్నారు.

తొమ్మిదేళ్ల క్రితం ప్రతిపాదనలు

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement