మేధావుల మౌనం దేశానికి నష్టం | - | Sakshi
Sakshi News home page

మేధావుల మౌనం దేశానికి నష్టం

Feb 28 2025 9:01 PM | Updated on Feb 28 2025 9:00 PM

ఎంపీ రఘునందన్‌రావు

దుబ్బాక: మేధావుల మౌనం దేశానికి ప్రమాదకరమని మెదక్‌ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. గురువారం అక్భర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో తన సతీమణితో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశాభివృద్ధికి మేధావుల ఆలోచన విధానాలు చాలా అవసరమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హ క్కు వినియోగించుకోవడం మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ఉన్నత చదువులు అభ్యసించి రాజ్యాంగం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న మేధావులు ఓటుకు దూరంగా ఉండడం ఎంత మాత్రం దేశానికి మంచిది కాదన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement