కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్2లో అక్రమంగా తరలిస్తు న్న నిషేధిత గడ్డిమందును సోమవారం పట్టుకున్నట్లు ఆర్పీఎఫ్ సీఐ శ్రీరామ్మీనా తెలిపా రు. తమకు అందిన సమాచారం మేరకు బల్లార్షా నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న రామగిరి ఎక్స్ప్రెస్ రైలులో సోదాలు నిర్వహించగా 81 గడ్డి మందు ప్యాకెట్లు, 5 లీటర్ల 5 క్యాన్లు, 5 లీటర్ క్యాన్లు పట్టుకున్నట్లు పే ర్కొన్నారు. గడ్డి మందును కాగజ్నగర్ మండల వ్యవసాయాధికారి రామకృష్ణకు అప్పగించినట్లు తెలిపారు. తనిఖీల్లో ఆర్పీఎఫ్ ఎస్సై ప్రాచీదేవి, ఏఎస్సై ఆర్.దాసు, సిబ్బంది కమలేశ్కుమార్ సింగ్, ప్రేమానంద్ పాల్గొన్నారు.


