ఇటీవల ప్లాస్టిక్ విని యోగంపై తనిఖీలు చేపట్టి, పలువురికి జరిమానా విధించాం. ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించి, వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రజల్లో సరైన అవగాహన లేక ప్లాస్టిక్ వినియోగం పెరుగుతోంది. ఇకపై ప్రతినెలా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టి కార్పొరేషన్ పరిధిలో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధం అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. ప్లాస్టిక్ కవర్లు అమ్మినా, వినియోగించినా మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – అన్వేష్,
కమిషనర్, మంచిర్యాల కార్పొరేషన్


