దండేపల్లి: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్యదేవరాజన్ను ఆదివాసీ సేనా రాష్ట్ర అధ్యక్షుడు కోవా దౌలత్రావ్ మొకాశీ హైదరా బాద్లో శనివారం కలిశారు. సీనియర్ ఆదివాసీ నా యకుడు కుంరం విఠల్రావ్ ఆధ్వర్యంలో పలు ఆది వాసీ సమస్యలపై కమిషనర్కు వినతిపత్రాలు అందించారు. ముఖ్యంగా దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్, వందుర్గూడ పంచాయతీ స మస్యను గురించి ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు దౌలత్రావ్ తెలిపారు. వందుర్గూడ ప్రత్యేక పంచాయతీ ని రద్దుచేసి నెల్కివెంకటాపూర్ పంచాయతీలోనే కొ నసాగించాలని కోరినట్లు పేర్కొన్నారు. తమ సమస్యలపై కమిషనర్ సానుకూలంగా స్పందించారన్నా రు. పెసా కోఆర్డినేటర్ అర్క వసంత్రావు, నెల్కివెంకటాపూర్, వందుర్గూడ గ్రామపటేల్ మొకాశి బీర్షావ్, ఆత్రం రాజ శేఖర్ తదితరులు ఉన్నారు.


