
బవారి నుంచి వచ్చాం
భైంసా: రాజస్థాన్లోని బవారి నుంచి పది కుటుంబాలవాళ్లం భైంసాకు వస్తుంటాం. వినాయక చవితికి నాలుగు నెలల ముందే ఇక్కడికి వచ్చి విగ్రహాలు తయారు చేస్తాం. విగ్రహాల తయారీకి అవసరమయ్యే సామగ్రిని ఇక్కడే తెచ్చుకుంటాం. సంతోషీమాత ఆలయం ఎదురుగా విగ్రహాలు తయారు చేసి విక్రయిస్తుంటాం.
– శంకర్లాల్, రాజస్థాన్ కళాకారుడు
ఇంటి వద్దే 15 ఏళ్లుగా..
భైంసా: మా తండ్రి ఇజ్గిరి ముత్తన్నతో కలిసి 15ఏళ్లుగా వినాయకుడు, దుర్గామాత విగ్రహాలను తయారు చేస్తున్నాం. పొలాల అమావాస్యకు ముందు ఎద్దుల బొమ్మలు కూడా తయారు చేసి పొలాల రోజున విక్రయిస్తాం. వినాయక చవితికి వినాయక విగ్రహాలు, నవరాత్రులకు ముందు దుర్గామాత విగ్రహాలను అమ్ముతాం.
– ఇజ్గిరి భోజన్న, మిర్జాపూర్

బవారి నుంచి వచ్చాం

బవారి నుంచి వచ్చాం