
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో గత నెల 30న నిర్వహించిన రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికై నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ తెలిపారు. ఎంపికై న వారిలో శివాని (పెంచికల్పేట్), ఆత్రం ధనలక్ష్మి (మర్లవాయి), ప్రవీణ్ (బెజ్జూర్) ఉన్నారు.ఈనెల 9 నుంచి 11 వరకు తమిళనాడులోని ఆరని, తిరువన్నమళై పట్టణాల్లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వారు పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులను బుధవారం అభినందించారు.