కారును ఢీకొన్న లారీ.. | - | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న లారీ..

Apr 21 2025 12:55 AM | Updated on Apr 21 2025 12:55 AM

కారును ఢీకొన్న లారీ..

కారును ఢీకొన్న లారీ..

జగిత్యాలక్రైం: దైవ దర్శనానికి వచ్చిన భక్తులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఘటన ఆదివారం జగిత్యాల రూరల్‌ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌కు చెందిన కడెం శ్రీరాం, ల్యాండ్రి ము న్నా, దన్నూరి ప్రణీత్‌, కారెపు రుషి, కడెం విశ్వంత్‌, భూమేశ్‌, రిషికరుణ్‌, నిమ్మల నర్సయ్య, కారే మధు ఆదివారం కొండగట్టు దైవదర్శనానికి వచ్చారు. అక్కడి నుంచి ధర్మపురి పుణ్యక్షేత్రానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో జగిత్యాల రూరల్‌ మండలం పొలాస గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌ తరలించారు. రూరల్‌ ఎస్సై సదాకర్‌ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement