నిద్రపోతున్న నిఘానేత్రం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కొన్ని నెలలుగా నిర్వహణ లేక నిరుపయోగమయ్యాయి. దీంతో ప్రధాన రహదారులపై ఏదైనా ఘటన జరిగితే ఛేదించడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. ప్రైవేట్ దుకాణాసముదాయాల వారు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలపై ఆధారపడకతప్పడంలేదు. వెంటనే సీసీ కెమెరాలకు మరమ్మతు చేసి వినియోగంలోకి తేవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
ఈద్గాం చౌరస్తాలో..
చేపల మార్కెట్ వద్ద..
ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తాలో..
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట..
బస్టాండ్ సెంటర్ లైటింగ్ లైన్లో..
శివాజీచౌక్లో..