కోస్గి రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైనప్పటికీ చదువుపై పెంచుకున్న మమకారంతో పరీక్షకు హాజరయ్యాడు ఓ ఇంటర్ విద్యార్థి. పట్టణంలోని ప్రజ్ఞ జూనియర్ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కార్తీక్రెడ్డి ఈ నెల 21న కశాశాలలో నిర్వహించిన వీడ్కోలు సమావేశం అనంతరం బైకుపై మిత్రులతో కలిసి గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ముగ్గురు మిత్రులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో పాలమూర్ జిల్లా గండిడ్ మండలంలోని రెడ్డిపల్లికి చెందిన కార్తీక్రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో మూడు పరీక్షలకు హాజరుకాలేదు. శుక్రవారం జరిగిన జంతుశాస్త్రం పరీక్షకు గాయాలతోనే హాజరయ్యాడు. అధికారులు అరుబయట టేబుల్ ఏర్పాటు చేసి పరీక్షకు అనుమతిచ్చారు.


